ఏపీ టీడీపీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస రావు ను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గాజువాక నుండి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెంది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన వాడిగా రికార్డ్ బద్దలు కొట్టాడు.
