హైదరాబాద్ జులై 12(జే ఎస్ డి ఎం న్యూస్):
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ బాధ్యతల స్వీకరించారు.ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎం.ఎస్ ) కు చెందిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జూలై 11, 2025న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ (ఐ.ఆర్.ఎస్.ఈ) కు చెందినవాడు.. ఈ పదవికి పూర్వం ఆయన సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (సి.ఓ.ఆ.ఈ ) జనరల్ మేనేజర్గా పనిచేశారు . సివిల్ ఇంజనీరింగ్కు సంబంధించిన వివిధ సాంకేతిక పురోగతులు మరియు విధానాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్రపోషించారు.ఆర్.డి.ఎస్.ఓ, ఆర్.ఐ.టి.ఈ.ఎస్ మరియు రైల్వే బోర్డులో విశిష్టమైన కెరీర్తో, ఆయన రైల్వే మౌలిక సదుపాయాలు, మెట్రో ప్రాజెక్టులు మరియు అధునాతన రైలు సాంకేతికతల అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతూ తన నాయకత్వ పటిష్ట లక్షణాలను సుస్థిరం చేసుకున్నారు.
ఆర్.డి.ఎస్.ఓలో రైలు సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు: శ్రీవాస్తవ ఆర్.డి.ఎస్.ఓలో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫ్రా-1)గా పనిచేశారు. వారి పదవీకాలంలో, 60 కిలోల R350HT గ్రేడ్ పట్టాలు, తొమ్మిది ప్రోబ్లు మరియు బి -స్కాన్ సౌకర్యాలతో కూడిన ఎస్.ఆర్.టి /డి. ఆర్.టి మరియు ఫ్లాష్ బట్ జాయింట్ల కోసం ఫేజ్డ్ అర్రే యూ.ఎస్.ఎఫ్.డి వంటి అధునాతన రైలు సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతగానో దోహదపడ్డారు. ఎం&సి డైరెక్టరేట్ మరియు భిలాయ్ స్టీల్ ప్లాంట్తో ఆయనకు ఉన్న అనుబందం మరియు సహకారం ఎంతో కీలకమైనవి.
కీలక పదవులలో విస్తృత అనుభవం: తొలుత శ్రీవాస్తవ వల్సాద్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించి, తరువాత ముంబై మరియు వడోదరలో డివిజనల్ ట్రాక్ ఇంజనీర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వంటి వివిధ కీలక పదవులను నిర్వహించారు. (ఆర్.ఐ.టి.ఈ.ఎస్) రైట్స్ లో జనరల్ మేనేజర్ (అర్బన్ ట్రాన్స్పోర్ట్)గా ఆయన పదవీకాలంలో కోల్కతా, కొచ్చి మరియు నాగ్పూర్ మెట్రోలతో సహా మెట్రో ప్రాజెక్టులకు ప్రణాళిక, డిజైన్ మరియు టెండరింగ్ ప్రక్రియలలో అపారమైన కృషి చేశారు.
విద్యా మరియు వృత్తిపరమైన విజయాలు: ఐఐటీ రూర్కీ మరియు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ, అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టాను పొందారు. బికనీర్లో డివిజనల్ రైల్వే మేనేజర్గా పదవీతో సహా భారతీయ రైల్వేలలో విస్తృతమైన పాత్రలతో , ఆయనకు ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ నిర్వహణ మరియు సాధారణ పరిపాలనపై లోతైన అవగాహన ఉంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నియామకం రైల్వే ఇంజనీరింగ్, మెట్రో అభివృద్ధి మరియు పరిపాలనా నాయకత్వంలో ఆయనకున్న విస్తృత నైపుణ్యాన్ని నొక్కి చెబుతుంది. సాంకేతిక ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి దక్షిణ మధ్య రైల్వేను మరింత సామర్థ్యం మరియు విజయం వైపు నడిపిస్తుందనీ ఆశిస్తున్నారు.

