ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలకు, వడగండ్లకు శనివారం వరకు 1622.5 ఎకరాలు పలు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనా అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. అందులో కురిచేడు, దర్శి, లింగసముద్రం మండలాలలో పలు గ్రామాలకు చెందిన 770 మంది రైతులకు చెందిన 1622.5 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు. అందులో వరి 709 మంది రైతులకు చెందిన 1472.5 ఎకరాలు, మొక్కజొన్న 61 మంది రైతులకు చెందిన 150 ఎకరాలు ఉన్నట్లు వివరించారు.
