రైతులు బోర్లకు సంబంధించిన నీటిని పొలాలకు పొదుపుగా వాడుకోవాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు సూచించారు. మండలంలోని దారంవారిపాలెంలో క్షేత్ర పర్యటనలో భాగంగా బోర్లకింద సాగు చేసిన పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
