బేగంపేట మోతీలాల్ నెహ్రూ నగర్ లో వున్న మాజీ ఎన్ డి ఎమ్ ఏ ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు మర్రి శశి ధర్ రెడ్డి కి ఓటర్ స్లీప్ ను అందజేశారు.
సనత్ నగర్ నియోజక వర్గం పోలింగ్ స్టేషన్ 37 పరిది కి చెందిన ఓటర్ స్లీప్ లను మున్సిపల్ అధికారి ,మోతీలాల్ నెహ్రూ నగర్ అసోసియేషన్ సంబంధించిన బట్ లు మర్రి శశిధర్ రెడ్డి కి ఓటర్ స్లీప్ లను అందజేశారు. ఈ సందర్భంగా మర్రి శశి ధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా ఎన్నికలలో నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల అధికారులు ఓటర్లకు మరింత అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని సూచించారు.
