జిల్లాలో ప్రసిద్ది గాంచిన తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీ సోమవరప్పాడు గ్రామ పరిధిలో వేంచేసిన గుంటి గంగాభవాని అమ్మవారికి భక్తులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు బాలరాజు, కామేశ్వరశర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈఓ కార్తీక్, ఆర్.ఏ శ్రీనివాసరావు లు భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈనెల 21వ తేదీన ఆలయంలో మహాచండీ యాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఈఓ కార్తీక్ లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
