రబీలో సాగు చేసేందుకు ప్రభుత్వం 25శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు అందజేయనున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. ఎకరానికి గరిష్టంగా 14 కేజీలు ఐదు ఎకరాల వరకు విత్తనాలు అందజేయనున్నట్లు చెప్పారు. జె. జె 11 రకం క్వింటాళ్లు పూర్తి ధర రూ. 9400 కాగా, రాయితీ 2350 పోను రైతు వాటా రూ. 7050 40 కేజీలు అయితే రూ. 2820 చెల్లించాలని చెప్పారు. కాగ్ -2 రకం క్వింటాళ్లు పూర్తి ధర రూ. 12,100 కాగా రాయితీ పోను రూ.3025 పోను, రైతు వాటా రూ.9075, 40 కేజీలు అయితే రూ. 3630 చెల్లించాలని చెప్పారు. కార్యక్రమంలో విఏఏ అజ్మీర్ సుష్మ సుల్తానా పాల్గొన్నారు.
