శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న డా. కోట నీలిమ.

సనత్‌నగర్, ఏప్రిల్ 6 (జె ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీరామనవమి సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యురాలు మరియు సనత్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా. కోట నీలిమ పాల్గొన్నారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ శాంతి, ఐక్యత, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు డా. నీలిమ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీలిమా తో పాటు సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *