శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రర్థలతో నిర్వహించారు. భక్తి శ్రర్థలతో పూజిస్తే వరాలు అందించే వరక్ష్మి దేవికి మహిళలు ఎంతో పవిత్రంగా వేకువజాము నుండే ఒక్కపొద్దులు ఉండి వ్రతాన్ని ఆచరించారు. బొద్దికూరపాడు గంగా పార్వతి వర్థిని సోమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. మహిళలు వ్రతాన్ని ఆచరించి ఐదుగురు ముత్తయిదువులను తాంబూలాలు, ప్రసాదాలు ఇరుగు పొరుగు మహిళలకు అందించారు. దీంతో గ్రామాలలో భక్తి బావం వెల్లివిసిసింది. పలు ఆలయాలలో కూడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు.



