సికింద్రాబాద్ , 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆషాడ బోనాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఎస్ ఈ గోపయ్య శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సమయంలో విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం
లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ప్యారడైజ్ డివిజనల్ ఇంజనీర్ బ్రహ్మనందం ఏడి ఈ శివ దుర్గాప్రసాద్ ఎ ఈ కాసం రవికుమార్ మరియు జనరల్ బజార్ సిబ్బంది ఉన్నారు.
