ఆంధ్ర ప్రదేశ్ 104 ఎం. ఎం. యు ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు 104 ఎం. ఎం.యు వాహన ఉద్యోగులు డ్రైవర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని పాద యాత్రలో నేటి ముఖ్యమంత్రి హామీ మేరకు నేరుగా కంట్రాక్ట్ , ఎపీసీఓఎస్ అబ్బార్జ్ చెయ్యాలని విన్నవిస్తూ మంగళవారం ఆయా వైద్యశాలలో వైద్యాధికారులకు వినతి పత్రం అందించారు. అందులో పలు డిమాండ్స్ ఎమనగా … 104 MMU సేవలను గతంలో వలే రా లే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. ముఖ్యమంత్రి హామీ (31-10-2019) మేరకు 104 MMU ఉద్యోగులను లో నేరుగా అబ్జార్జ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. 3) జీ.ఓ.నెంబరు 4459 ప్రకారం PF, ESI సక్రమంగా అమలు చేయాలి, యాజమాన్యం చెల్లించాల్సిన ఎంప్లాయిర్ కాంట్రిబ్యూషన్ అరబిందో యాజమాన్యమే చెల్లించాలి.
DSC, ROR ద్వారా నియమించబడిన సీనియర్ డ్రవర్స్కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు & రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 0-5, 5-10, 10 + సంవత్సరాలు సర్వీస్ పూర్తైన వారికి స్లాబ్ సిస్టం ఆటోమేటిగ్గా అప్డేట్ చేయాలి. ప్రతి నెలా సక్రమంగా ఉద్యోగులకు స్థానిక ప్రదేశాలకు బదిలీ అవకాశం కల్పించాల. గతంలో వలె ఫుడ్ అలవెన్స్, ట్రావెల్, వాహనంలో మంచినీటి సదుపాయం కల్పించాలి.
వాహనాలకు సకాలంలో క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి, వాహనాలకు ఫిటెనెస్, ఇన్సూరెన్స్ చేయించాలి. ఉద్యోగులు హెల్త్ మరియు గ్రూప ఇన్సూరెన్స్ చేయించాలి.
వాహనాల చిన్న చిన్న మరమ్మత్తులకు (ఎయిర్ చెకింగ్, పంక్చర్, వాటర్ వాష్, హబ్ గ్రీజింగ్) మొదలగు వాటికి అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి. ఉద్యోగులు సంఘ ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో (జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి) ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించాలి.
జిల్లాలో కొరత లేకుండా DEO’s ని డ్రైవర్స్ ని రిక్రూట్ చేయాలి.
బలవంతంగా 104 డ్రైవర్స్ని 108 డ్యూటీలకు చేయించరాదని డిమాండ్ చేశారు.

