నిరుద్యోగులకు గుడ్న్యూస్. పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత తపాలా శాఖ ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. రెండు లేదా మూడు రోజుల్లో నాలుగో జాబితా కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 పోస్టులు.. బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
India Post GDS ముఖ్య సమాచారం:
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి.
India Post GDS ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22.05.2023
దరఖాస్తులకు చివరితేదీ: 11.06.2023
దరఖాస్తు సవరణలకు అవకాశం: జూన్ 12 నుంచి 14 వరకు ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్:https://indiapostgdsonline.gov.in/