ప్రజా సంక్షేమం, పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలో నాల్గవ సచివాలయ పరధిలో లంకోజన పల్లి రోడ్లో, 9 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ . వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నవరత్నాలు అమలుతో అర్హలందరికి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నవరత్నాలు అందరికి అమలుతో అర్హలందరికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇంటింటికి తిరిగి అభిపత్రాలను అందించారు. కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జీఎస్ అచ్చారావు, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌల్సిలర్లు మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, బాబు, సర్పంచిల సంఘం అధ్యక్షుడు కీసరి రామ్ భూపాల్ రెడ్డి, జెసీఎస్ పట్టణ కన్వినర్ ఎదురు కోటి రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ ప్రసాద్, వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ విమల రామక్రిష్ణ, మాజీ వైస్ ఎంపీపీ పాణ్యం రహమాన్ మాజీ సొసైటీ అధ్యక్షుడు పూసల చిన్నయ్య, కట్టెకోట హరీష్, మిల్లర్ బుజ్జి, యర్రయ్య, గంజి వెంకటేశ్వర రెడ్డి, కిక్కిరు రమణా రెడ్డి, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, కొడవటి జాన్, బ్రహ్మయ్య, కర్నా రమణా రెడ్డి, పాశం జయసింహా, మజ్నువలి, బాజీ, సచివాలయ కన్వీనర్ రాజేష్. అధికారులు మున్సిపల్ కమీషనర్ మహేష్, విద్యుత్ ఎఈ ప్రసాద్, హౌసింగ్ షేక్ షాకీర్ తదితరులు
పాల్గొన్నారు.



