ప్రపంచ యోగా దినోత్సవంను దర్శి కోర్ట్ ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి జి .ఎల్. వి ప్రసాద్ మాట్లాడుతూ… ప్రపంచానికి భారత దేశం అందించిన సంజీవని యోగా అని దీని సాధన ద్వారా పూర్వికులు అనేక అద్భుతాలు చేసారని అన్నారు. యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత వస్తుందని అన్నారు. అనంతరం యోగాసనాలు వేశారు కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జిఎల్వి సరస్వతి న్యాయవాదులు పాల్గొన్నారు.


