దర్శి పట్టణం లో ఇటీవల అగ్నిప్రమాదంలో దుకాణం కోల్పోయి రూ.3 కోట్లు వరకు నష్టపోయిన మేడా హనుమంత రావు కుటుంబ సభ్యులను డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మంగళ వారం పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్నీ విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
*వృద్ధులకు అన్నదానం*
సొసైటీ మాజీ అధ్యక్షుడు పూసల చిన్నయ్య సతీమణి సుశీల 7వ వర్ధంతి సందర్భంగా మద్దిశెట్టి శ్రీధర్ ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలో వారు చేపట్టిన అన్నదాన కార్యక్రమా నికి హాజరయ్యారు. మండల కన్వీనర్ వెన్నపూస వెం కటరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మితఅంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రవి, ఎదురు శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎర్రయ్య పాల్గొన్నారు.


