దర్శి మండలంలోని జముకుల దిన్నె సర్పంచ్ మర్రి సత్యనారా యణ నూతనంగా నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ శనివారం ప్రారంభించారు. సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శి నుంచి జము కుల దిన్నెకు భారీ ర్యాలీ నిర్వహించారు. జముకుల దిన్నెలోరూ.5 లక్షల నిధులతో నిర్మించిన కల్వర్టు, రూ.3 లక్షలతో సైడ్ కాలువ, రూ.5 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాఅచ్చయ్య, సచివాల యాల మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సర్పంచ్ అంకాల శ్రీను, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఈఓఆర్డీ శోభన్బాబు, మండల ప్రత్యేకాధికారి రవికుమార్ పాల్గొన్నారు.
