నూతన వ్యక్తుల కదలికలు , గ్రామాల్లో ఎన్నికల వాతావరణ పరిస్థితులపై ఘర్షణలకు తావు లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండా లని ఎస్సై వై.వి.రమణయ్య సూచించారు. గ్రామాల్లో అవాం ఛనీయ సంఘటనలు, ఘర్షణలకు దారితీసే పరిస్థితులు ఉంటే వెంటనే సమాచారాన్ని తెలియజేయాలన్నారు. లక్కవరంలో శుక్రవారం సాయంత్రం గ్రామస్థులకు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారి కదలికలపై పోలీసులకు తెలియజేయాలన్నారు.
