దర్శి నియోజక వర్గంలోని నాలుగు ప్రాధమిక కేంద్ర ఆరోగ్యకార్యకర్తలకు హిమోగ్లోబిన్ పరీక్షలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తల ట్రైనర్స్ ఆర్ వెంకట్, కె పవన్ కుమార్ పాల్గొని హెచ్. బి నూతన యంత్రాల పనితీరు, పరీక్షల నిర్వహించు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పీహెచ్.బి వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ… ప్రతి కార్యకర్త ట్రైనర్స్ చెప్పిన అంశాలను క్షేత్ర స్థాయిలో పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మారెళ్ల, తూర్పుగంగవరం, ముండ్లమూరు, తాళ్లూరు పీహెచ్. బి ల పరధిలోని కార్యకర్తలు శిక్షణలో పాల్గొన్నారు.
