అనారోగ్యంతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం తాళ్లూరులో చోటుచేసుకుంది. కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో నివసించే కోట రామిరెడ్డి(68) గత కొంతకా లంగా నొప్పులతో బాధపడుతున్నా డు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నొప్పులు భరించలేక సోమవా రం ఉదయం గుళికల మందు తిన్నా డు. ఇది గమనించిన రామిరెడ్డి అన్న కుమారుడు రాజశేఖర్ హుటా హుటీన ఒంగోలు రిమ్స్ కు తరలిం చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయాన్ని తాళ్లూరు పోలీసు స్టేషన్ కు తెలపడంతో ఏఎస్సై మో హన్ రావు ఒంగోలు వెళ్లి మృతదేహా న్ని సందర్శించారు. రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కుటుంబీకు లకుఅప్పగించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
