వ్యవసాయ డిప్లొమా కొర్సులకు నోటిఫికేషన్ విడుదల

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి. సంధ్యారాణి బుధవారం తెలిపారు. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకొనుటకు 10 వ తరగతి పాస్ అయినవారుతో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 2023 ఆగస్టు 31 వ తేది నాటికి 15 నుండి 22 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. . గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు చదివిన వారికి మున్సిపాలి టీ లలో చదివిన వారికి 75 : 25 నిష్పతి లో సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. డబ్ల్యూ .డబ్ల్యూ. డబ్ల్యు .ఏ ఎన్ జి ఆర్ ఏ యు .ఏసీ .ఇన్ అనే వెబ్ సైట్లో జూన్ 1 వతేది నుండి జూన్ 30వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించబడునని స్థానికులకు ఎవరికైనా సందేహలు ఉంటే స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ద దర్శివ్యవసాయ పాలిటెక్నిక్, దర్శిలో సంప్రదించవలసిందిగా తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *