రాష్ట్రంలో జనము మెచ్చె పాలన సీఎం వైఎస్ జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు అన్నారు. పట్టణంలో పలు డివిజన్లలో బుధవారం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు .49వ డివిజన్ పరధిలో బుధవారం వైఎస్సార్సీపీ బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ ఇన్చార్జీ తాళ్లపాలెం శ్రీనివాసరావు, కార్పోరేటర్ అంగరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు, నాయకులు కసిబిసి నాగేశ్వరరావు, సూరసారి నర్సా రెడ్డి, బత్తుల కాశయ్య, ఢాకా రాఘర రెడ్డి, మల్లిఖార్జున్, జయరాం, షేక్ గౌస్ నాయబ్రసూల్, అంగిరేకుల నాగేశ్వరరావు, కుర్ర గురసత్యం, మళ్లీబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.





