సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ ఉత్సవ కమిటీ బోర్డు మెంబర్ గా బేగంపేట కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సూధాం ను నియమించడం పట్ల ఆయన సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మరియు బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు విశాల్ సూ ధం కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సనత్ నగర్ నియోజకవర్గ వర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి భక్తుడిగా బేగంపేట లో భూ లక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన తనకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.బోనాల జాతర కు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి సేవలో ఉంటూ భక్తులకు సేవలు అందిస్తా నని విశాల్ సూ ధం తెలియజేశారు.


