బేగంపేట ఏప్రిల్ 19 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్రకాశం నగర్ లో చలివేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి పై అభిమానంతో ప్రతి ఏటా వేసవిలో షేక్ గౌస్ చలి వేండ్రం ద్వారా పాదచారులు,వాహనదారులు,ప్రయాణీకులు,ఆర్టీసీ సిబ్బంది దాహార్తి తీరుస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డి సి సి అధ్యక్షులు దీపక్ జాన్,ప్రధాన కార్యదర్శి అభిషేక్,షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

