పచ్చదనం# పచ్చదనం కార్యక్రమమ తాళ్లూరు మండలం దోసకాయలపాడు లో మాజీ సర్పంచి సత్యం సారధ్యంలో టిడిపి మాజీ లీగల్ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ… మొక్కలు పెంచడం లో ప్రభుత్వం చొరవ చూపాలి అని అన్నారు. వర్షాలు పడాలి అంటే, వాతావరణం లో సమతుల్యత ఉండాలి అన్నారు. మొక్కలు విరివిగా పెంచి రక్షించాలి అని అడవులు రోజుకు రోజు తగ్గి పోతున్నాయి అని, అందుకే వర్షాలు సకాలంలో పడటం లేదు అని అన్నారు. ప్రకృతి రక్షించాలి అని, పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత అని. ప్రతి మొక్కకు ఓసద గుణం ఉంది కావున అన్ని మొక్కలు ఏదో ఒక విదంగా ఉపయోగ పడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో,శ్రీకాంత్, సుబ్బారావు,సురేంద్ర, వెంకటరావు , మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.


