కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతోనే తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.ఈ సందర్భంగా తాను ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డ్రైనేజ్,రోడ్లు,మంచినీరు సదుపాయం,దోమల బెడద ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు..స్పందించిన ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలు అన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి ఓల్డ్ వాసవి నగర్ లో ఎమ్మెల్యే పర్యటించి డ్రైనేజ్ లైన్, రోడ్డుపైనే చెత్త, ఉండటాన్ని పరిశీలించారు,ఈ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జై నాగశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు బొజ్జ అజయ్,అసోసియేషన్ మెంబర్ తేలుకుంట అరుణ్ జ్యోతి సతీష్ గుప్తా,భాస్కర్, కోట నాగేశ్వరరావు, రేపాల వెంకటేశ్వర్లు,రవికాంత్,తెరాల శ్రీనివాస్,అమర్నాథ్,వసుంధర మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


