లాల్‌దర్వాజాశ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ పాల్గొన్న నగర సీపీ వీసీ సజ్జనర్.

హైదరాబాద్ జులై 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. ఆలయప్రాంగణంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా హైదరాబాద్ సీపీని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా ఆలయ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తూ ,గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్ బి తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలుతీసుకున్నామని స్పష్టం చేశారు. 2 వేల మంది
సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ విభాగం, ‘షీ టీమ్స్’ ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వివరించారు.. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారంఅందించాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు సీపీ సౌత్ రేంజ్ తఫ్షిర్ ఇక్బాల్,
చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ ఈ.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *